పోస్ట్‌లు

53. ఇంద్రియ విషయవాంఛను వదులుకోవడం

చిత్రం
  “ ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించని వ్యక్తి నుండి , ఇంద్రియ వస్తువులు దూరమైపోతాయి కానీ ' రస్ ' ( కాంక్ష/ రాగం) విడనాడదు. పరమాత్మను తెలుసుకున్నప్పుడు మాత్రమే కోరిక అంతమై పోతుంది ” అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు ( 2.59). ఇంద్రియాలకు భౌతిక పరికరం , మెదడులో ఒక నియంత్రకం ఉంటాయి. మనస్సు అనేది అన్ని ఇంద్రియ నియంత్రకాల కలయిక. కోరికలకు స్థానమైన ఈ నియంత్రకాలపై దృష్టి సాధించమని శ్రీకృష్ణుడు మనకు సలహా ఇస్తున్నారు. శ్రీకృష్ణుడు ' రస్ ' ( రసం) అనే పదాన్ని ఉపయోగిస్తారు. పండిన పండ్లను కోసి పిండినప్పుడు తప్ప రసం కనిపించదు ; పాలలో ఉన్న వెన్న పరిస్థితి కూడా అంతే. అలాగే ' రన్ ' అనేది ఇంద్రియ నియంత్రకాలలో ఉండే అంతర్గత కోరిక. అజ్ఞాన స్థాయిలో , ఇంద్రియాలు ఇంద్రియ వస్తువులతో జతచేయబడతాయి ; సుఖదుఃఖాల యొక్క ద్వంద్వాల మధ్య ఊగిస లాడుతూ ఉంటాయి. తదుపరి దశలో కోరికలను తీర్చు కోవడానికి మార్గం లేక ఆ కోరికలను వదిలి వేస్తాము. ఉదాహరణకి , డబ్బు లేకపోవడం లేదా వైద్యుల సలహా వంటి బాహ్య పరిస్థితుల కారణంగా మిఠాయి వంటి ఇంద్రియ వస్తువులను వదిలేస్తాము కానీ మిఠాయిపై కోరిక మిగిలిపోతుంది. నైతికత , దేవుడ

52. ఉపసంహరించుకోవడమే వివేకం

చిత్రం
  “ తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనునట్లుగా , ఇంద్రియములను ఇంద్రియార్థముల (విషయాదుల) నుండి అన్నివిధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. ” అని శ్రీకృష్ణుడు చెప్తున్నారు ( 2.58).       శ్రీకృష్ణుడు ఇంద్రియాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే అవి మన అంతర్గత , బాహ్య ప్రపంచాలకి మధ్య ద్వారముల వంటివి. తాబేలును ఉదాహరణగా తీసుకుంటే అది ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు దాని అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియ వస్తువులతో ఇంద్రియాలు జతకూడటం గమనించినప్పుడు మన ఇంద్రియాలను ఉపసంహరించుకోవాలని ఆయన సలహా ఇస్తున్నారు.       ప్రతి ఇంద్రియానికి రెండు భాగాలు ఉంటాయి. ఒకటి బయటకు కనిపించే కన్ను వంటి బాహ్య ఇంద్రియ పరికరం. రెండవది ఈ కన్నును నియంత్రించే మెదడులోని ఇంద్రియ నియంత్రక భాగం.       ఇంద్రియముల ఇంద్రియార్థముల మధ్య పరస్పర స్పందనలు రెండు స్థాయిలలో జరుగుతాయి. మొదటిది , కాంతి యొక్క కణాలు (ఫోటాన్లు) బాహ్య ఇంద్రియ పరికరమైన కన్నును చేరినప్పుడు కన్ను స్వయంచాలకంగా కాంతికి స్పందిస్తుంది. అలాగే మిగతా ఇంద్రియ పరికరాలు కూడా తమ తమ ఇంద్రియ విషయాలకు స్వయం

51. విరక్తి కూడా ఒక అనుబంధమే

చిత్రం
  మనం ఒక పరిస్థితిని , ఒక వ్యక్తిని లేదా ఒక పని యొక్క ఫలితాన్ని మంచి , చెడుగా విభజిస్తాము. ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యని మూడవ స్థితి కూడా సంభవమే. శ్రీకృష్ణుడు ఈ మూడవ స్థితిని ప్రస్తావిస్తూ , “ దేనియందును మమతాసక్తులు లేనివాడును , అనుకూల పరిస్థితుల యందు హర్షము , ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడును అగు పురుషుడు స్థిత ప్రజ్ఞుడు అనబడును ” అని చెప్తారు ( 2.57). స్థితప్రజ్ఞుడు ( 2.50) తన స్వంత అభిప్రాయాల్ని వదిలివేసి వాస్తవాలను వాస్తవాలుగా తీసుకుంటాడని ఇది సూచిస్తుంది , ఎందుకంటే ఇలా మంచి లేదా చెడు అనే విభజనే సుఖదుఃఖాలనే ద్వంద్వాలకు జన్మస్థలం. .       పరిస్థితులను , వాస్తవాలను తక్షణమే మంచి లేదా చెడు అని పేర్కొనే మన ధోరణికి విరుద్ధంగా ఈ బోధన నడుస్తుంది కాబట్టి కఠినమైనది గా అనిపిస్తుంది. చెడుగా అనిపించే పరిస్థితి లేదా వ్యక్తిని ఎదుర్కొన్నప్పుడు అయిష్టత , విరక్తి , ద్వేషం స్వయంచాలకంగా అనుసరిస్తాయి. కాని స్థితప్రజ్ఞుడు ఏ పరిస్థితి గురించి అభిప్రాయాన్ని ఏర్పరచుకోడు కాబట్టి అతనిలో ద్వేషం యొక్క పుట్టుకకు అవకాశమే లేదు. అదే విధంగా మంచిని చూసినప్పుడు స్థితప్రజ్ఞుడు పొం

50. రాగం, భయం, క్రోధం

చిత్రం
  దుఃఖములకు కృంగిపోనివాడును , సుఖములకు పొంగిపోని వాడును , రాగము , భయము , క్రోధము లేని వాడిని స్థితప్రజ్ఞుడు అందురు ” అని శ్రీకృష్ణుడు చెప్పారు ( 2.56). సుఖం-దుఃఖం , లాభం - నష్టం ; విజయం-అపజయాలను సమానంగా భావించమని శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశానికి ( 2.38) ఇది కొనసాగింపు.       మనమందరం సుఖాన్ని కోరుకుంటాము కానీ దుఃఖం అనివార్యంగా మన జీవితాల్లోకి వస్తుంది. ఎందుకంటే అవి రెండూ ద్వంద్వ (ధ్రువ) జంటలుగా ఉన్నాయి. ఇది ఎర వెనుక కొక్కెం దాగి ఉన్న చేపల ఎర లాంటిది. మరోవైపు కష్టంతో కూడిన పరిశ్రమ ఎల్లప్పుడూ ప్రతిఫలాన్ని తెస్తుంది.       స్థితప్రజ్ఞుడు అంటే ఈ ధ్రువాలను అది గమించి ద్వంద్వాతీతుడైన వాడు. మనం ఒకదానిని ఆశిస్తున్నప్పుడు బహుశా వేరే ఆకారంలో లేక కొంత సమయం గడిచిన తర్వాత దాని విపరీతము అయిన రెండో ధృవం మనని అనుసరించడానికి బాధ్యలవుతామన్న అవగాహన.       మన ప్రణాళికతో మనం సుఖాన్ని పొందినప్పుడు అహంకారం ఉప్పొంగిపోతుంది. అది ఉత్తేజం తప్ప మరేమీ కాదు. అయితే అది దుఃఖంగా మారినప్పుడు అహంకారం గాయపడుతుంది. ఇది ఉద్రేకం , క్రోధం తప్ప మరేమీ కాదు , ఇది నిస్సందేహముగా అహంకారం యొక్క ఆటని సూచిస్తుంది. స్థితప్రజ్ఞుడు

49. స్థితప్రజ్ఞత అనేది అంతర్గత ఘటన

చిత్రం
  శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా స్థితప్రజ్ఞుడు తన పట్ల తాను సంతృప్తితో ఉంటాడని చెప్పారు. స్థితప్రజ్ఞత గలవారు ఎలా మాట్లాడుతారు , కూర్చుంటారు , నడుస్తారు అనే అర్జునుడి ప్రశ్న యొక్క రెండవ భాగానికి శ్రీకృష్ణుడు స్పందించలేదు.       ' స్వయం తో సంతుష్టి ' అనేది పూర్తిగా అంతర్గత ఘటన. బాహ్య ప్రవర్తన ఆధారంగా దానిని కొలవడానికి అవకాశం లేదు. బహుశా ఉన్న పరిస్థితులలో అజ్ఞాని , స్థితప్రజ్ఞుడు ఇద్దరూ ఒకే మాటలు మాట్లాడవచ్చు ; అదే పద్ధతిలో కూర్చోవచ్చు ; నడవచ్చు ; ఇది స్థితప్రజ్ఞతను గురించి మన అవగాహనను మరింత క్లిష్టతరం చేస్తుంది. .       కృష్ణుని జీవితం స్థితప్రజ్ఞుని జీవితానికి ఉత్తమ ఉదాహరణ. ఆయన పుట్టుకతోనే తల్లిదండ్రుల నుండి విడిపోయారు. ఆయన్ను ' వెన్న దొంగ ' అని పిలిచేవారు. ఆయన శృంగారం , నృత్యం , వేణువు పౌరాణికమైనవి కానీ ఆయన బృందావనం విడిచి పెట్టాక శృంగారాన్ని కోరుతూ తిరిగి రాలేదు. ఆయన అవసరమైనప్పుడు పోరాడారు ; చంపారు. కానీ కొన్ని సమయాల్లో యుద్ధానికి దూరంగా ఉన్నారు. అందుకే ' యుద్ధం నుండి పారిపోయే వ్యక్తి ' అని పిలువబడ్డారు. ఎన్నో అద్భుతాలు చేసారు. స్నేహితులకు స్నేహ

48. 'స్వయం'తో సంతృప్తి

చిత్రం
  శ్రీకృష్ణ భగవానుడు శ్లోకము 2.11 నుంచి శ్లోకము 2.53 వరకు సాంఖ్యయోగం అంటే ఏమిటో వెల్లడించారు. ఇది అర్జునుడికి పూర్తిగా కొత్త విషయం . అర్జునుడు సమాధిని సాధించిన స్థితప్రజ్ఞ పురుషులను గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఒక స్థితప్రజ్ఞత గల వ్యక్తి ఎలా మాట్లాడుతారో , కూర్చుంటారో , నడుస్తారో తెలుసుకోవాలను కున్నాడు.       శ్లోకం 2.55 నుండి , అర్జునుడికిచ్చే వివరణల ద్వారా , శ్రీకృష్ణుడు , మన చంచల మనస్సుని అదుపులో పెట్టడానికి కొలమానాలను నిర్ధారించారు. వీటిని ఉపయోగించుకొని ఆధ్యాత్మిక ప్రయాణంలోని మన పురోగతిని స్వయంగా కొలుచుకోవచ్చు.       శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు , “ మనస్సు నందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి , ఆత్మద్వారా ఆత్మయందు సంతుష్టుడై , ఆత్మానందమును పొందినవానిని స్థితప్రజ్ఞుడని యందురు ” (2.55). ఒక వ్యక్తి తనపట్ల తాను సంతృప్తి చెందినప్పుడు కోరికలు వాటంతటవే రాలిపోతాయి. కోరికలు రాలిపోయినప్పుడు వారు చేసే చర్యలన్నీ నిష్కామ కర్మలు అవుతాయి.       ఉన్నదానికంటే భిన్నంగా ఉండాలనేది మన ప్రాథమిక కోరిక. మనం మనకున్న ప్రస్తుత పరిస్థితితో చాలా త్వరగా విసుగు చెందుతాము. ఈ స్థితిని అర్థశాస్త్రంలో “ తీర

47. స్థిరమైన బుద్ధి

చిత్రం
  మన జీవిత గమనంలో ఒకే విషయం పై విరుద్ధమైన అభిప్రాయాలను విన్నప్పుడు మనం కలవరపడతాము - అది వార్తలు , తత్వశాస్త్రం , ఇతరుల అనుభవాలు , నమ్మకాలు ఏమైనా కావచ్చు. వివిధ అభిప్రాయాలను విన్నప్పటికీ మన బుద్ధి నిశ్చలంగా (చలించకుండా) , సమాధిలో స్థిరంగా ఉన్నప్పుడు మనం యోగాన్ని పొందుతామని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు ( 2.53).       ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి చెట్టు సరైన ఉదాహరణ. దాని పై భాగం కనిపిస్తుంది ; క్రింది భాగం వేళ్ల మూల వ్యవస్థతో కూడి అదృశ్యంగా ఉంటుంది. పై భాగం గాలుల బలానికి ఊగుతుంది ; కానీ వాటివల్ల వేళ్ల వ్యవస్థ ప్రభావితం కాదు. ఎగువ భాగం బాహ్య శక్తులకు ఊగిసలాడుతున్నప్పుడు లోపలి భాగం సమాధి స్థితితో నిశ్చలంగా ఉంటుంది. స్థిరంగా ఉండడంతో పాటు పోషకాహారాన్ని అందించే తన బాధ్యతను నిర్వహిస్తుంది. బాహ్యభాగం ఊగిసలాడుతూ అంతర్గతంగా నిశ్చలంగా ఉండటమే చెట్టుకు యోగస్థితి. -       అజ్ఞాన స్థాయిలో మనకున్న చంచల బుద్ధి బాహ్య ఉద్దీపనలకు ప్రభావితమై దానంతటదే ఊగిసలాడుతుంది. ఈ ఉగిసలాట తాత్కాలిక స్పందనలు , ఉద్వేగాలు , కోపాల రూపంలో మన నుంచి బయటకు వచ్చి మన జీవితాలను సమస్యాత్మకం చేస్తాయి. మన వ్యక్తిగత జీవితాలనే కాక