పోస్ట్‌లు

95. పాపసాగరం దాటేందుకు జ్ఞానమనే నావ

చిత్రం
    కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తాను పాపం చేస్తున్నాననే భావన వల్ల విషాదానికి లోనయ్యారు. తన గురువులను , చుట్టాలను , స్నేహితులను చంపడం పాపమని ( 1.36) అటువంటి పాపపు పనుల నుండి పారిపోవాలని అతడు భావించాడు ( 1.38). రాజ్యం పట్ల దురాశతో అన్నదమ్ములు తమ సొంత సహోదరులని చంపడానికి సిద్ధమయ్యారనే వాస్తవం అతన్ని మరింత కలతకు గురిచేసింది ( 1.45). ఈ దృక్పథంలోని విషయాలని అర్థమయ్యేలా చెప్పేందుకు అనేక సమయాల్లో శ్రీకృష్ణుడు అర్జునుడితో పదేపదే పాపం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. “ నీవు పాపాత్ములలో కెల్లా పాపాత్ముడవైనా , పాపమనే సముద్రాన్ని జ్ఞానమనే నావ ద్వారా భద్రంగా దాటవచ్చు ( 4.36). మండుతున్న అగ్ని కట్టెను బూడిదగా మార్చినట్టు జ్ఞానం అనే అగ్ని అన్ని కర్మలను బూడిదగా మారుస్తుంది ” అని శ్రీకృష్ణుడు అంటారు ( 4.37). కృష్ణుడికి పాపము చీకటి వంటిది. జ్ఞానము , అవగాహన అనే కాంతి ద్వారా దానిని తొలగించవచ్చు. చీకటి ఎంతో కాలం నుంచి అక్కడ ఉండవచ్చు లేదా కటిక చీకటి అలముకుని ఉండవచ్చు. కానీ ఒక్కసారి వెలుగు ప్రసరించాక వెంటనే దాన్ని రూపు మాపుతుంది. ఇది మతపరమైన బోధనలకు విరుద్ధంగా ఉంటుంది. ఈ బోధనలో మన చేత చేయబడ్డ పాప కర్మల

94. నేర్చుకోవడం అనే కళ

చిత్రం
    జీవితాంతం అభ్యసించగల , నేర్చుకోగల సామర్థ్యం మనుషులకు మాత్రమే దక్కిన వరం. కానీ ఏమి నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అన్నది కీలక ప్రశ్న. సత్యాన్ని గ్రహించిన జ్ఞానులకు సాష్టాంగ ప్రణామం చేయడం , ప్రశ్నించడం , సేవ చేయడం ద్వారా తత్వ జ్ఞాన ప్రాప్తి కలుగుతుందని శ్రీకృష్ణుడు ఒక మార్గాన్ని సూచించారు ( 4.34). సాష్టాంగ ప్రణామం అంటే వినమ్రత , వినయం , ఇతరుల దృక్పథాన్ని అర్ధం చేసుకోవడానికి సహనం , విశాల దృక్పథం. ఇది మనం అహంకారాన్ని అధిగమించామనడానికి సూచిక. ప్రశ్నించడం అనేది ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లోని ఫీడ్ బ్యాక్ వలయం లాంటిది ; అవగాహన వచ్చే వరకు మనం ఆలోచిస్తున్న వాటిని ; చెబుతున్నవాటిని ; చేస్తున్నవాటిని ; అన్నింటినీ ప్రశ్నిస్తూనే ఉండటం. ఆత్మసాక్షాత్కారం పొందినవారు (గురువు) ఎవరు ? వారిని కనుగొనడం ఎలా అనేది తదుపరి ప్రశ్న. శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణుడు తనకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పిన జ్ఞాని యొక్క ఉదంతాన్ని వివరిస్తారు. ఆ జ్ఞాని , భూమి నుంచి క్షమను ; పసిబిడ్డ నుంచి అమాయకత్వాన్ని ; గాలి నుంచి నిస్సంగాన్ని ; తేనెటీగల నుంచి నిల్వ చేయడన్ని నిరోధించే లక్షణాన్ని ; సూర్యుడి నుంచి సమానత్వాన్ని ; చేపల

93. సంతృప్తే అమృతం

చిత్రం
  శ్రీకృష్ణుడు రెండు సందర్భాలలో ( 3.9 - 3.15, 4.234.32) యజ్ఞ రూపమైన నిష్కామ కర్మల గురించి మాట్లాడారు. ప్రేరేపిత కర్మలు మనల్ని కర్మ బంధనాల్లో ఇరికిస్తాయమని ఆయన హెచ్చరించారు ( 3.9). అందుకే ఆసక్తి , విరక్తికి అతీతమైన అనాసక్తితో కర్మలను చేయమని సలహా ఇస్తారు. యజ్ఞం అనే నిస్వార్ధ కర్మ అత్యున్నత శక్తిని కలిగి ఉందని ( 3.15); ప్రారంభంలో ఈ శక్తిని ఉపయోగించి సృష్టికర్త సృష్టించారని ఆయన సూచిస్తారు ( 3. 10). ఆయన యజ్ఞానికి సంబంధించిన అనేక ఉదాహరణలను ఇచ్చారు ( 4.23-4. 32). అవన్నీ నిష్కామ కర్మల వేర్వేరు రూపాలని , ఈ సాక్షాత్కారం మనకు విముక్తి కలిగిస్తుందని ముగించారు ( 4.32). మోక్షం గురించిన భగవంతుని యొక్క ఈ హామీ మనకు శిరోధార్యం. పాపం గురించి వివరిస్తూ శ్రీకృష్ణుడు సుఖం-దుఃఖం ; లాభనష్టం ; విజయం-ఓటమి అనే ద్వంద్వాలు మధ్య అసమతుల్యత నుండి ఉత్పన్నమయ్యే చర్యే పాపం అని సూచించారు ( 2.38, 4.21). దీనివల్ల గాఢమైన పశ్చాత్తాపం , పగ , ద్వేషం వంటి కర్మ బంధనాలకు మనం గురవుతాము. “ అంతఃకరణమును , శరీరేంద్రియ ములను జయించినవాడు ; సమస్త భోగసామాగ్రిని పరిత్యజించినవాడు ; ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి కేవలం శారీరక కర్మలను ఆచరించుచ

92. శ్వాస ద్వారా ఆనందం

చిత్రం
  గుండె కొట్టుకోవడం వంటి మానవ శరీరంలోని కొన్ని కార్యకలాపాలు నిర్ణీత లయను అనుసరిస్తూ స్వయంచాలకంగా జరుగుతాయి. కాళ్లు , చేతుల వంటి కొన్ని అవయవ వ్యవస్థల కార్యకలాపాలను మనం నియంత్రించవచ్చు. కానీ శ్వాస అనేది స్వయంచాలకమైనది. అలాగే దాన్ని మనం నియంత్రించగలం కనుక ప్రత్యేకమైనది. యజ్ఞం (నిష్కామ కర్మ) , శ్వాస సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు , “ కొందరు అపానవాయువునందు ప్రాణవాయువును , మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువునువ హవనం చేస్తారు ; కొందరు ప్రాణ , అపాన వాయుగతిని నిరోధించడం ద్వారా ప్రాణాయామంలో లీనమవుతారు ” (4.29). శ్వాస యొక్క వ్యవధి , తీవ్రత మానసిక స్థితిని సూచిస్తాయి. ఉదాహరణకు , మనం కోపంగా ఉన్నప్పుడు మన శ్వాస దానంతటదే వేగంగా తక్కువ తీవ్రతతో ఉంటుంది. దీని అర్థమేమిటంటే మనం మన శ్వాసను నెమ్మదిగా , లోతుగా మార్చడం ద్వారా మన కోపాన్ని నియంత్రించుకోవచ్చు. శ్వాసను నియంత్రించడం ద్వారా మనస్సును నియంత్రించవచ్చని ఇది సూచిస్తుంది. ఇది ధ్యానం , ప్రాణాయామం వంటి అనేక పద్ధతులకు దారితీసింది. శివుడు పార్వతికి 112 ధ్యాన పద్దతులను వివరిస్తున్నప్పుడు , పూర్తిగా శ్వాసపై ఆధారపడిన కొన్ని పద్ధతుల గురించి పేర్కొ

91. స్వీయ అధ్యయనం

చిత్రం
    ' కడుపులో కాలటం ' అంటే భౌతిక ప్రపంచంలో తన కోరికలు నెరవేర్చుకోవడానికి అభిరుచులు ; విధులను కొనసాగించడానికి కావలసిన శక్తి , ఉత్సాహంతో నిండి ఉండటం. అటువంటి శక్తిని ఆత్మసాక్షాత్కారం కోసం ఉపయోగించినప్పుడు దానిని ' యోగ-అగ్ని ' అంటారు. ఈ సందర్భంలో , “ మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను , ప్రాణముల క్రియలను అన్నింటిని జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మసంయమ యోగ రూపాగ్నిలో హవనము చేయుచుందురు ” (4.27) అని శ్రీకృష్ణుడు చెప్పారు. రోజువారీ జీవితంలో , మనం పరమాత్మకు అందమైన పువ్వులు , రుచికరమైన ఆహారం వంటి ఇంద్రియాకర్షక వస్తువులను సమర్పిస్తాము. మనల్ని వీటిని అధిగమింప జేసి , యజ్ఞం (నిష్కామకర్మ) అంటే కేవలం ఇంద్రియ వస్తువులను మాత్రమే అర్పించడం కాదని ; రుచి , అందం లేదా వాసన వంటి ఇంద్రియ కార్యకలాపాలను కూడా అర్పించడమని ఈ శ్లోకం చెబుతుంది. ఇంద్రియాలు , ఇంద్రియ వస్తువుల యందు ఆసక్తి , విరక్తి ద్వారా మనల్ని బాహ్య ప్రపంచంతో కలుపుతూనే ఉంటాయి. ఈ ఇంద్రియాలను త్యాగం చేసినప్పుడు ఆసక్తి , విరక్తి నశించిపోయిన తర్వాత మిగిలేది పరమాత్మతో ఐక్యతే. “ కొందరు ద్రవ్యసంబంధ యజ్ఞములను , మరికొందరు తపో రూప యజ్ఞములను ,

90. త్యాగాన్ని త్యజించడం

చిత్రం
  యజ్ఞమనేది త్యాగం లేదా నిష్కామ కర్మలకు ప్రతీక. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు , “ కొందరు యోగులు దేవతల కోసం త్యాగం చేస్తారు ; మరికొందరు త్యాగం అనే భావనని బ్రహ్మ యొక్క అగ్నిలో త్యాగం చేస్తారు ” (4.25). అవగాహన లేని వ్యక్తికి జీవించడం అంటే కేవలం ప్రోగు చేసిన వాటిని రక్షించడం. వస్తువులు , ఆలోచనలను , భావాలను త్యాగం చేయడం జీవితం యొక్క తదుపరి ఉన్నత దశ. ఇది అహంకార బీజాలను మనస్సు యొక్క సారవంతమైన నేలపై నాటడానికి బదులు అగ్నికి ఆహుతి ఇవ్వడం లాంటిది. మూడవ దశలో అన్నీ బ్రహ్మమే అని గ్రహించి త్యాగం అనే భావననే త్యాగం చేయడం. మనస్సు ఆధారిత కర్మయోగి కర్మ కోసం వెతుకుతూ ఉంటాడని , యజ్ఞమే అతనికి మార్గమని చెప్పవచ్చు. బుద్ధి ఆధారిత జ్ఞాన యోగి స్వచ్ఛమైన అవగాహన కోసం చూస్తూ త్యాగాన్నే త్యాగం చేస్తాడు. మొదటిది క్రమానుగతం అయితే రెండోది చాలా పెద్ద ఘటన , కానీ అరుదైనది. రెండు మార్గాలు ఒకే గమ్యానికి దారి తీస్తాయి. శ్రీకృష్ణుడు ఈ వాస్తవికతను ఇంద్రియాల సందర్భంలో వివరిస్తారు , “ కొంతమంది యోగులు శ్రోత్రాది ఇంద్రియములను సంయమన రూపాగ్నులయందు సమము చేయుదురు. మరి కొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను

89. స్వీయ ముక్తిని పొందడం

చిత్రం
  భగవద్గీతలో అనాసక్తి , వీత్ రాగ్ వంటి కొన్ని పదాలు భగవద్గీత యొక్క సారాంశాన్ని సూచిస్తాయి. ఆసక్తి , విరక్తి రెండు ధ్రువాలు అయితే అనాసక్తి ఈ ధ్రువాలు అధిగమిస్తుంది. అదేవిధంగా , వీత్ రాగ్ అనేది రాగం లేదా విరాగం కాదు ; రెండింటినీ అధిగమించింది. ఈ ధ్రువణాలు అహంకార వ్యక్తీకరణ తప్ప మరొకటి కాదు. ' అహం ' ఒకసారి మాయమైనప్పుడు ఆ వ్యక్తి అన్ని ధ్రువాలను అధిగమిస్తాడు. ఆ దశనే మనము ముక్తి , మోక్షము అనే పేర్లతో పిలుస్తాము. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు , “ ఆసక్తి , దేహాభిమానము మమకారము ఏమాత్రం లేనివాడును , జ్ఞానంలో స్థిరపడిన వాడును , కేవలం యజ్ఞార్ధమే కర్మలను ఆచరించువాడును అయిన మనుషుని కర్మలన్నియును పూర్తిగా విలీనమగును ” (4.23). ' అహం ' అనేది మన సంపదలు , ఆస్తులతో గుర్తింపు , స్నేహితులు - శత్రువులు ; ఇష్టాలు-అయిష్టాలు , ఆలోచనలు-భావాలతో గుర్తింపు. వాటిని వదిలివేయడం వల్ల బాధ , భయం , ఆగ్రహానికి దారితీసే తాత్కాలిక శూన్యత ఏర్పడుతుంది. కాబట్టి ' అహం ' ను వదిలివేయడం అంత తేలికైన పని కాదు. గుర్తింపదగిన విషయం ఏమిటంటే యాజమాన్యం , గుర్తింపు , కర్తృత్వం యొక్క ఆలోచనను ,