పోస్ట్‌లు

జులై, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

5. జ్ఞాన, కర్మ, భక్తి యోగాలు

చిత్రం
      వారి వారి దృష్టికోణాలను బట్టి భగవద్గీత అనేక మందికి అనేక విధాలుగా దర్శనమిస్తుంది. ఆత్మజ్ఞానము పొందడానికి భగవద్గీత మూడు మార్గాలను ఉపదేశిస్తుంది. కర్మయోగము , సాంఖ్య యోగము , భక్తి యోగము. కర్మయోగం మనస్సు ఆధారితమైన వారికి అనువైనది. సాంఖ్యయోగం బుద్ధిపై , భక్తియోగం హృదయం పై , ఆధారపడే వారికి అనుకూలమైనవి.       ఈనాటి ప్రపంచంలో అత్యధిక శాతం మనస్సు మీద ఆధారపడే వర్గానికి చెందుతారు. మనమేవో సంకెళ్ళతో కట్టబడ్డామనీ , వాటిని తెంచుకునేందుకు చాలా కష్టపడి పని చేయాలన్న నమ్మకంపై ఆధారపడి ఇది పనుల దిశగా ప్రేరేపిస్తుంది. వీరితో ఏ విధమైన సంభాషణైనా ' ఇప్పుడు నేను ఏమి చేయాలి ' అన్న అంశంతో ముగుస్తుంది. ఈ దారి మనను నిష్కామకర్మ , అంటే కోరికలు లేని , ఫలితము ఆశించని కర్మల వైపు నడిపిస్తుంది.       సాంఖ్య యోగాన్ని జ్ఞాన యోగం అని కూడా అంటారు. ఇక్కడ జ్ఞానం అంటే మనం సాధారణంగా ఉపయోగించే విజ్ఞానం కాదు ; ఇది కేవలం అవగాహన లేదా తెలుసుకోగలిగే సామర్థ్యం గురించి మాత్రమే. మనమేదో చీకటిగదిలో ఉన్నామని , ఏమి చేసినా కూడా ఈ అంధకారం పోదు గనక దాన్ని పారద్రోలడానికి ఒక దీపాన్ని వెలిగించాలన్న నమ్మకమే దాని ఆరంభ

4. మనస్సు ఆడించే ఆటలు

చిత్రం
మన లోపలి వెలుపలి ప్రపంచాలకు ఇంద్రియాలు ద్వారాల వంటివి. అందుకే భగవద్గీత వాటిని అర్థం చేసుకోమని నొక్కి చెబుతుంది. “ ఒకటిగా పనిచేసే నాడీకణాలు (న్యూరాన్లు) ఒక్కటిగానే ముడిపడి ఉంటాయని ” నాడీ శాస్త్రం ప్రతిపాదిస్తుంది. దీనినే హార్డ్ వైరింగ్ అంటారు. భగవద్గీతలోని వాక్యాలు కూడా , ఆ కాలాన్ని బట్టి ఉపయోగించే భాషలో ఇదే సందేశాన్ని ఇస్తాయి.       మన మెదడులో 100 బిలియన్ న్యూరాన్లు ఉన్నాయి. కొన్ని మన డిఎన్ఏ ( DNA) కారణంగా ముడిపడి అసంకల్పితంగా జరిగే ప్రాథమిక దేహ క్రియల కోసం ఉపయోగించబడతాయి. మరికొన్ని మన జీవితకాలంలో మనము చేసే కర్మల ద్వారా ముడివేయ బడతాయి. మొదటి రోజు డ్రైవింగ్ వీల్ ముందు కూర్చున్నప్పుడు మనకు కారు నడపడం కష్టంగా అనిపిస్తుంది. తర్వాత నెమ్మదిగా మనం దానికి అలవాటు పడతాము. ఎందుకంటే , అప్పటివరకు వాడుకలో లేని న్యూరాన్లను మన మెదడు హార్డ్ వైరింగ్ ద్వారా జోడించి డ్రైవింగ్ కు సంబంధించిన అన్ని చర్యల్లో పాల్గొనేలా చేస్తుంది. దీనికి సమయం పడుతుంది.       అన్ని రకాల నైపుణ్యాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మామూలు నడక నుంచి ఆటల దాకా , ఒక సర్జన్ జరిపే క్లిష్టమైన శస్త్ర చికిత్సల దాకా ఇదే జరుగు

3. వర్తమానానిదే ప్రాధాన్యత

చిత్రం
మనమేమిటో భగవద్గీత చెబుతుంది. ఇది సత్యాన్ని గురించి తెలిసుకొనటమే కాకుండా , సత్యవంతులై ఉండటం వంటిది. మనం వర్తమానంలో జీవించినప్పుడే ఇది సాధ్యమౌతుంది. అంతర్లీనంగా , అర్జునుడి సందిగ్ధం ఏమిటంటే , ఒకవేళ అతను తన మిత్రులను , బంధువులను , పెద్దలను , గురువులను రాజ్యం కోసం చంపితే , ప్రపంచం దృష్టిలో తన ప్రతిష్ట ఏమవుతుందా అని! ఇది చాలా తార్కికంగా కనబడుతుంది. భగవద్గీత చెప్పిన ప్రకారం జీవించాలంటే దాటాల్సిన మొట్టమొదటి అవరోధమిది. అర్జునుడి అసలైన సందిగ్ధం అతని భవిష్యత్తును గురించి , కానీ మనకు కర్మ చేసే హక్కు తప్ప కర్మఫలాల పై అధికారము హక్కులేదని కృష్ణుడంటారు. ఎందుకని ? ఎందుకంటే కర్మ వర్తమానంలో జరుగుతుంది కానీ కర్మఫలం అనేది భవిష్యత్తులో వచ్చేది.       అర్జునుడి లాగానే మనము కూడా కర్మఫలాలను ఆశించి అనేక కర్మలు చేస్తూ ఉంటాము. ఆధునిక జీవనం కొన్నిసార్లు మనం భవిష్యత్ పరిణామాలను నియంత్రించగలమన్న భావనను కలిగిస్తుంది. కానీ భవిష్యత్తు అనేది మన చేతుల్లో లేని అనేక సంభావనల కలయిక. మన అహంకారమే గతంపై ఆధారపడి , వర్తమానంలో భవిష్యత్తును చూపిస్తూ ఇటువంటి సందిగ్దాలు సృష్టిస్తుంది. దీనివల్ల మనం వర్తమానంలో ఉండలేని

2.జీవితంలోని వైరుధ్యాలు

చిత్రం
“ అన్ని మార్గాలు ఒకే గమ్యానికి చేరతాయి ” అన్నట్లుగా భగవద్గీతలో ఇవ్వబడిన అన్ని మార్గాలు మనల్ని ఆత్మజ్ఞానం వైపుకి నడిపిస్తాయి. కొన్ని దారులు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి. కానీ ఇదంతా ఒక వలయం లాంటిది. ఏ దారిలో ప్రయాణించినా కూడా ఒకే గమ్యానికి మనల్ని తీసుకుని వెళ్తాయి. గీతోపదేశము వివిధ స్థాయిల్లో ఉన్నదన్న విషయాన్ని మన మెల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు శ్రీకృష్ణుడు అర్జునుడి స్థాయికి వచ్చి బోధిస్తారు. కొన్నిసార్లు ఆయన పరమాత్మగా ప్రకటితమవుతారు. ప్రాథమిక దశలో ఈ రెండు స్థాయిలూ వేరువేరుగా కనిపిస్తాయి కనుక ఆకళింపు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. గత శతాబ్దం మొదట్లో కాంతిని అర్థం చేసుకునేటప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొదట కాంతికి తరంగ స్వభావం ఉందని నిరూపించారు. తర్వాత అది కణంలా ప్రవర్తిస్తుందని గుర్తించబడింది. ఈ రెండు సిద్ధాంతాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తాయి. కానీ మనం ప్రతి క్షణం చూసే కాంతి స్పష్టమైన వైరుధ్యాల కలయిక. అలాంటిదే జీవితం కూడా! ఒకసారి ఒక ఏనుగు ఒక గ్రామంలో ప్రవేశించిందట! కొంత మంది అంధులు దాన్ని గు

1. అహంకారం తో ఆరంభం

చిత్రం
  శ్రీకృష్ణ భగవానుడికి , యోధుడైన అర్జునుడికి కురుక్షేత్రమనే యుద్ధ క్షేత్రంలో జరిగిన 700 శ్లోకాల సంభాషణే ' భగవద్గీత. ' యుద్ధంలో తన బంధుమిత్రులు ఎంతో మంది చనిపోతారన్న భావన కలిగి , ఇది మంచిది కాదని అర్జునుడు వాదిస్తాడు. ' నేను కర్తని '- అహం (నేను) కర్త (చేసేవాడిని) , అంటే అహంకారమనే భావనలో నుంచే అర్జునుని సందిగ్ధత జనించింది. ఈ అహంకారం మనం ప్రత్యేకమని చెబుతుంది కానీ వాస్తవం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. మామూలుగా గర్వాన్ని అహంకారానికి అర్థంగా అనుకొంటునప్పటికీ , అహంకారం యొక్క అనేక రూపాల్లో గర్వం ఒకటిగా భావించవచ్చు. భగవద్గీత మొత్తంలో , శ్రీకృష్ణుడు ఈ అహంకారాన్ని గురించి చెబుతూ , దాన్ని నిర్మూలించడానికి కావలసిన మార్గాలను , ఈ మార్గాలలో మన ప్రగతిని అంచనా వేసుకోటానికి కావలసిన మైలురాళ్లను (కొలబద్దల) గురించి బోధిస్తారు. కురుక్షేత్ర యుద్ధ రంగాన్ని పోలిన పరిస్థితులు మనందరి జీవితాల్లోనూ తరచూ ఎదురవుతాయి. అర్జునుడికి ఎదురైన సందేహాలు మన కుటుంబాల నేపథ్యంలోగానీ , పని చేసే చోట్ల కానీ , ఆరోగ్యం లేదా లాభనష్టాల విషయంలో కానీ ; సంబంధాలు , బంధుత్వాలు విషయంలో కానీ మనందరికీ ఎదురయ్యేవే. అ