పోస్ట్‌లు

ఆగస్టు, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

12. మనసును నియంత్రించడం

చిత్రం
              అర్జునుడు మనసును గాలితో పోలుస్తూ , సంతులనాన్ని పొందేందుకు దాన్ని ఎలా అదుపులో పెట్టాలో తెలుసుకోవాలని ఆశిస్తాడు. శ్రీకృష్ణుడు అది కష్టమైనదని చెబుతూ , వైరాగ్యాన్ని ఆచరించడం ద్వారా దాన్ని సాధించగలమని బోధిస్తారు.       జ్ఞాపకశక్తిని ఉపయోగించి , ఇంద్రియాలు అందించే సమాచారాన్ని సురక్షితమైనదిగా , సురక్షితం కానిదిగా నిర్ధారించేలా మనస్సుకు శిక్షణ ఇవ్వబడింది. పరిణామక్రమంలో ఈ సామర్ధ్యమే మనం జీవించడానికి , అభివృద్ధి చెందడానికీ ఉపయోగపడింది.       మనసుకున్న ఇదే సామర్థ్యాన్ని అంతరాత్మను చేరడానికి కూడా ఉపయోగించవచ్చు. దీనినే జాగరూకత అని కూడా అంటారు. మనం ఈ సామర్ధ్యం ద్వారా సొంత ఆలోచనలు , భావనలను తిరిగి మనస్సుకు అందించి దాని నిర్ణయాల యొక్క నాణ్యతను మెరుగు పరుచుకోవచ్చు.       నేటి ఆధునిక యుగంలో ఎలక్ట్రానిక్ వ్యవస్థలను స్థిరీకరించ డానికి మెషీన్ లెర్నింగ్ (యాంత్రిక అభ్యాసాన్ని) ను , కంప్యూటర్ల పనితీరును మెరుగు పరిచేందుకు ఈ విధంగానే ' ఫీడ్ బ్యాక్ లూప్స్ ' (Feedback loops) ను ఉపయోగిస్తున్నారు. ఇది సహజంగా రాదు కనక , ఆచరణ ద్వారా ఈ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని శ్రీకృష్ణుడు సూచిస్

11. దుఃఖం సుఖాన్ని అనుసరిస్తుంది

చిత్రం
  ద్వంద్వాతీతం అంటే  ద్వంద్వాలను /విరుద్ధ భావాలను అది గమించడం. భగవద్గీతలో ఉన్న మరొక అమోముమైన ఉపాయం ఇది. అర్జునుడిని ఈ స్థితికి చేరమని చెబుతూ శ్రీకృష్ణుడు వేర్వేరు సందర్భాలలో అనేక సలహాలను ఇస్తారు.       “ సుఖాన్ని పొందడానికి మనం చిత్తశుద్ధితో కష్టపడి పని చేసినా కూడా బాధ/దుఃఖం మనకు ఎలా కలుగుతాయి ?” అన్నది మానవాళిని ఉత్కంఠకు గురిచేసే సాధారణ ప్రశ్న. మన లోపలికి చూసే బదులు మన ప్రయత్నాలు సరిపోలేదని మనల్ని మనమే సమాధాన పరచుకుంటాము. కానీ ఆశతో కూడుకున్న అహంకారం సుఖాన్ని పొందడం కోసం తిరిగి మనం ఇదే ప్రక్రియను మొదలు పెట్టేలా ప్రేరణ కలిగిస్తుంది ; ఇలా జీవితం ముగిసే దాకా కొనసాగుతుంది. ద్వంద్వాతీతము అన్న దాన్ని అర్థం చేసుకోవడమే ఈ ప్రశ్నకు సమాధానం.       వ్యక్తమయ్యే ప్రపంచంలో ప్రతిదీ దాని విరుద్ధ ధృవంతో (ద్వంద్వ) పాటే ఉనికిని కలిగి ఉంటుంది. పుట్టుకకు వ్యతిరేక ధృవం చావు ; సుఖానికి దుఃఖం , గెలుపుకి ఓటమి ; లాభానికి నష్టం ; కలయికకు విడిపోవడం ; పొగడ్తకు విమర్శ ; షరతులతో కూడిన ప్రేమకు ద్వేషం ; ఇలా ఈ జాబితా అనంతంగా సాగుతూనే ఉంటుంది.       ఇక్కడ నియమం ఏమిటంటే , మనం వీటిలో ఒక దాని వెంటపడుతూ ఉంటే దాని విరుద

10. మహమ్మారిలో శ్రీకృష్ణుడు

చిత్రం
                 ఆత్మజ్ఞానం పొందే దారిలో మనకు ఎదురయ్యే అనేక అడ్డంకులను దాటడానికి , మూసివున్న ద్వారాలను తెరవడానికి కావలసిన అమోఘమైన తాళంచెవులన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అటువంటి ఒక కీలకమైన ఉపాయం మిమ్మల్ని ఇతరుల్లో , ఇతరుల్ని మీలో చూసుకోవడం. అందరిలో ఉన్నది తానేనని గుర్తు చేస్తూ , తాను నిరాకారుడినని శ్రీకృష్ణుడు సూచిస్తున్నారు. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు , మనం ఆయనకు సాష్టాంగ పడ్డ విధంగానే ఒక గాడిదకు లేక దొంగకు కూడా సాష్టాంగ ప్రణామం చేసే స్థాయికి ఎదగాలని చెబుతారు.       ఇంద్రియాలు మనకు అందించిన సమాచారం యొక్క ఆధారంగా మన మనస్సు మనము ఎదుర్కొంటున్న పరిస్థితులను , సురక్షితమైనవి/ఆహ్లాదకరమైనవి లేదా హానికరమైనవి/బాధాకరమైనవిగా నిర్ధారిస్తుంది. ఎదురవబోయే ప్రమాదాల నుంచి మనల్ని రక్షించడానికి ఇది ఎంతో అవసరం. ఇతర సాంకేతిక పరిజ్ఞానంలాగానే మన మనస్సు కూడా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది ; అది మన పై పెత్తనం చేయడానికి దాని పరిధుల్ని మీరుతుంది. ఇదే అహంకారానికి జన్మస్థానం.       భగవద్గీతలోని అమోఘమైన ఉపాయాలు , మనస్సుని బానిసగా చేసి ఈ విభజనలను తగ్గిస్తే , కలయిక ఐక్యత కలుగుతాయని చెబుతాయి. మన శరీరం లాంటి ఏదైనా

9. మిత్రుడిని, శత్రువును గుర్తించడం

చిత్రం
  భగవద్గీతలో కృష్ణ భగవానుడు మనకు మనము మిత్రులము , మనము మనకు శత్రువులము అంటారు. ఉచ్చుల్లో పడ్డ ఒక కోతి కథ ఈ విషయాన్ని మరింత తేలిగ్గా అర్ధం చేసుకోవటానికి ఉపయోగ పడుతుంది.       సన్నమూతి ఉన్న ఒక కుండ (కూజా)లో కొన్ని శెనగ గుళ్ళు ఉన్నాయి. అందులో కోతి చెయ్యి అతి కష్టం మీద పడుతుంది. కోతి తన చేతిని ఆ కుండ యొక్క మూతిలో అతి కష్టంగా దూర్చి చేతినిండా గింజలను పట్టుకుంది. చేతినిండా గింజలు ఉండడంతో చేతి పరిమాణం పెరిగి కుండ నుంచి బయటకు రాలేక పోతుంది. గుప్పిట నిండా గింజలు పట్టుకుని తన చేతిని బయటకు తీయడానికి కోతి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఎవరో దానికోసం ఉచ్చు బిగించారని అది భావిస్తుంది కానీ ఆ ఉచ్చును తనకు తానే ఏర్పరుచుకుందని ఎన్నడూ గుర్తించదు. మనము ఏ విధంగా వివరించినా కూడా ఆ కోతి ఆ గింజలను వదలదు ; బదులుగా మనమే దాని గింజలను చేజిక్కించుకునేందుకు చూస్తున్నామని భావిస్తుంది.       బయటి నుంచి చూస్తే అది కొన్ని గింజలను పడేస్తే గుప్పిట వదులై , దాని చెయ్యి బయటికి వస్తుందని తెలుస్తుంది. మనం అనూహ్య పరిస్థితుల్లోనో , విషమ పరిస్థితుల్లోనో చిక్కుకుని ఉన్నప్పుడు ఈ చిన్న విషయాన్ని గుర్తించడమే ఒక నిజమైన పరీక్ష

8. వ్యక్తము, అవ్యక్తము

చిత్రం
చుక్కానికి జోడించబడ్డ చిన్న యంత్రం (ట్రిం టాబ్) లోని మార్పు పెద్ద ఓడ యొక్క దిశను మారుస్తుంది. అలాగే, భగవద్గీతను అధ్యయనం చేయాలనే చిన్న తపన మన జీవన మార్గాన్నే గొప్పగా మార్చగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారి వల్ల మనకు అందుబాటులో ఉన్న కాలాన్ని భగవద్గీతలో మునగడానికి ఉపయోగిస్తే మన జీవితంలో పెద్ద మార్పు రావడానికి అవకాశము ఉంది. భగవద్గీత ప్రాథమిక విద్య (కిండర్ గార్డెన్) నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేవారి దాకా ఆత్మజ్ఞానం కోసం చదవదగ్గ శాశ్వతమైన పాఠ్య పుస్తకం. మొదటిసారి చదివినప్పుడు చాలా తక్కువ అంశాలు అర్ధమవుతాయి. కానీ, మనం వ్యక్తము మరియు అవ్యక్తం యొక్క దృష్టి కోణం నుంచి సులభంగా అర్థం చేసుకోవచ్చు. మన ఇంద్రియాల పరిధిలోకి వచ్చేవి వ్యక్తమైనవి; ఇంద్రియాలకు అతీతమైనవి అవ్యక్తమైనవి. వ్యక్తమయ్యే వాటి కథ బిగ్ బాంగ్ (బృహత్ ప్రళయం) మొదలు నక్షత్రాల పుట్టుక, ఈ నక్షత్రాల్లోని కీలకమైన భాగాల్లో అత్యున్నత రసాయనిక మూలకాలు కలిగిన అణువుల నిర్మాణం, నక్షత్రాలు విచ్ఛిత్తికి గురైనప్పుడు ఈ మూలకాలు చెల్లాచెదురవుతున్న తీరు, గ్రహ మండలం ఏర్పాటు, భూమ్మీద బౌద్ధిక జీవితం ఆరంభం వంటి అనేక అంశాలన

7. నిమిత్తమాత్రులుగా ఉండడం

చిత్రం
    భగవద్గీత యుద్ధక్షేత్రంలో పుట్టింది. ప్రస్తుతం కోవిడ్- 19 రోజులు కూడా ఈ కురుక్షేత్ర యుద్ధం లాగే ఉన్నాయి. దీనినే భగవద్గీతలోని ' నిమిత్తమాత్రులం '  అనే పదము ఈ పరిస్థితులను చక్కగా సంగ్రహిస్తుంది. నిమిత్త మాత్రులం అంటే ఆ భగవంతుని చేతుల్లో ఒక పరికరంలా ఉండడం.       అర్జునుడు కృష్ణుని యొక్క వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా (యథార్ధంగా) చూడాలనుకున్నాడు. అంధునికి ఏనుగును పూర్తిగా చూడడానికి ఒక కన్ను అవసరమైనట్లే అతనికి కూడా దాన్ని గ్రహించడానికి అదనపు ఇంద్రియం అవసరమయ్యింది.       తన విశ్వరూపాన్ని చూడడానికి కృష్ణ భగవానుడు అతనికి దివ్య దృష్టినిచ్చారు. తన వాస్తవికతను చూపించడంతో పాటు శ్రీకృష్ణుడు అతనికి భవిష్యత్ దర్శనప్రాప్తిని కూడా కలిగించారు , అందుకే అర్జునుడు అనేక మంది యోధులు మృత్యుముఖంలోకి ప్రవేశించడాన్ని చూశాడు.       ఈ యోధులంతా త్వరలోనే చనిపోతారని , ఆ ప్రక్రియలో నీవొక పరికరానివి మాత్రమేననీ భగవంతుడు చెబుతారు. మొదట శ్రీకృష్ణుడు అర్జునుడు కర్త కాదని చెబుతాడు. అర్జునుడు కనుక విజేతగా తిరిగి వస్తే , విజయమే అహంకారానికి అతి పెద్ద ప్రోత్సాహకం కనుక , అతడు అహంకారం నుంచి విముక్త

6. శాసన నియమాలు

చిత్రం
    భగవద్గీత ఆంతరంగిక ప్రపంచంలో సమత్వాన్ని , సద్భావనను నిలబెట్టుకోవడం కోసమైతే , చట్టం బయటి ప్రపంచంలో క్రమానుగత వ్యవస్థను నిలబెట్టడం కోసం. ఏ కర్మకైనా రెండు భాగాలు ఉంటాయి ఒకటి ఉద్దేశం , రెండోది అమలు చేయడం. చట్టం ఆధారిత ప్రపంచంలో , నేరపరిభాషలో లాటిన్ పదాలను ఉపయోగించి వీటిని ' మెన్స్ రియా అండ్ ఆక్టస్ రియస్ ' అని అంటారు.       ఉదాహరణకు ఒక సర్జన్ మరియు హంతకుడు ఇద్దరూ పొట్టలోనికి చాకును దించుతారు. ఇక్కడ సర్జన్ ఉద్దేశం కాపాడడం/ చికిత్స చేయడం కానీ హంతకుడి ఉద్దేశం హాని చేయడం/చంపడం. రెండు పరిస్థితుల్లోనూ మరణం సంభవించవచ్చు , కానీ ఉద్దేశాలు ఒకదానికి ఒకటి పూర్తిగా విభిన్నమైనవి.       చట్టం పరిస్థితులను బట్టి మారుతుంది కానీ భగవద్గీత శాశ్వతమైనది. రోడ్డుకు ఎడమ పక్కన నడపడం ఒక దేశంలో చట్టబద్ధమైనది కానీ మరొక దేశంలో నేరంగా పరిగణించబడవచ్చు. చట్టం పనులను మంచి పని లేదా చెడు పనిగా విభజిస్తుంది కానీ జీవితంలో అనేక సందేహాస్పదమైన పరిస్థితులు ఉంటాయి.       మనము పన్నులు కడుతూ ఉన్నంతవరకు (ఆక్టస్ రియస్) అది ఇష్టంతో కట్టారా కష్టంతో కట్టారా (మెన్స్ రియా) అన్న దానితో చట్టానికి సంబంధం లేదు. ఆ ప్రాంతం యొక్క చట్టా