పోస్ట్‌లు

అక్టోబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

26. గులాబీ ఎన్నడూ పద్మం కాలేదు

చిత్రం
శ్రీకృష్ణుడు స్వధర్మాన్ని గురించి వివరించి (2.31-2.37), ఒక క్షత్రియునిగా అది అతని స్వధర్మం కనుక అర్జునుడు యుద్ధం చేసేందుకు సంకోచించకూడదని (2.31) చెబుతారు. శాశ్వతమైనది, అవ్యక్తమైనది, అన్నిటా వ్యాపించినది అయిన దాన్ని గురించి చెబుతూ శ్రీకృష్ణుడు భగవద్గీతను ప్రారంభిస్తారు. దానిని సులభంగా అర్థం చేసుకునేందుకు ఆత్మ అంటారు. ఆ తర్వాత ఆయన స్వధర్మాన్ని గురించి మాట్లాడతారు. ఆఖరికి కర్మ విషయానికి వస్తారు. అంతరాత్మ గురించి మనం తెలుసుకునే ప్రయాణాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. మొదటిది మన ప్రస్తుత స్థితి; రెండవది మన స్వధర్మాన్ని తెలుసుకోవడం; మూడవది అంతరాత్మను చేరుకోవడం. నిజానికి మన ప్రస్తుత స్థితి మన స్వధర్మం, అనుభవాలు, జ్ఞానం, జ్ఞాపకాలు, ఊహలతో కలిసిన చంచలమైన మనస్సు యొక్క సమ్మేళనం. మానసిక భారాలనుంచి మనల్ని మనం విడిపించుకున్నప్పుడు స్వధర్మము నెమ్మదిగా స్పష్టమవుతుంది. క్షత్రియ అన్న పదంలో 'క్షత్' అంటే 'గాయము' 'త్రయ' అంటే 'రక్షణ ఇవ్వడం'. గాయాల నుంచి మనకు రక్షణనిచ్చేవాడే క్షత్రియుడు. గర్భంలో ఉన్నప్పటి నుండి పిల్లలు తమ కాళ్ళమీద తాము నిలబడే దాకా సంరక్షించే తల్ల

25. అహంకారం వేరైనప్పుడే గమ్యం చేరుకుంటాం

చిత్రం
శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు (2.29) - కొందరు 'దీనిని' (ఆత్మ)ని అద్భుతంగా చూస్తారు; మరికొందరు 'దీనిని' ఒక అద్భుతమని మాట్లాడతారు; మరికొందరు 'ఇది' అద్భుతమని వింటారు; అయినప్పటికీ ఇదేమిటన్నది ఎవరికీ తెలీదు. ఎవరికీ' అనే పదం, ఆత్మ ను అర్థం చేసుకోవడానికి తన ఇంద్రియాలను ఉపయోగించే పరిశీలకుడిని సూచిస్తుంది. ఈ రెండింటికీ మధ్య ఒక విభజన ఉన్నంత వరకు ఒక పరిశీలకుడు ఆత్మను గ్రహించలేడని శ్రీకృష్ణుడు అంటారు. ఒకసారి ఒక ఉప్పుతో చేసిన బొమ్మ సముద్రాన్ని శోధించాలని బయలుదేరింది. ఉపరితలంలోని అలలను దాటి, అది సముద్రంలోతుకి వెళ్లి, నెమ్మదిగా కరిగిపోవడం మొదలు పెడుతుంది. సముద్రగర్భాన్ని చేరుకొనే లోపల అది పూర్తిగా కరిగిపోయి సముద్రంలో భాగమై పోతుంది. అంటే అదే సముద్రంగా మారిపోయిందని ఉప్పు బొమ్మకు ఇక వేరే ఉనికి లేదని అనవచ్చు. పరిశీలకుడే (ఉప్పు బొమ్మ) పరికించేది (సముద్రం) గా మారినప్పుడు విభజనలు అంతమై ఐక్యత సాధించ బడుతుంది. ఈ ఉప్పు బొమ్మ మన అహంకారం (అహం కర్త; నేనే కర్తని) వంటిది. ఇది మన ఆస్తులు, ఆలోచనలు, చర్యల ద్వారా ఎల్లప్పుడూ మనల్ని సత్యం నుంచి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఎవర

24. ఆత్మ దేహాలను మారుస్తుంది

చిత్రం
ఆత్మ చంపదు లేక చంపబడదు; అజ్ఞానులు మాత్రమే ఇందుకు భిన్నంగా ఆలోచిస్తారని శ్రీకృష్ణుడు(2.19, 2.20) అంటారు. అది పుట్టుక లేనిది, శాశ్వతమైనది, మార్పులేనిది, పురాతనమైనది. ఇంకా, మనం చివికిపోయిన, పాతవి అయిన వస్త్రాలను వదిలివేసి కొత్తవి ధరించినట్లుగా, ఆత్మ భౌతిక దేహాలను మారుస్తుందని ఆయన అంటారు. సాంకేతిక పరిభాషలో దీన్ని శక్తి పరిరక్షణ సూత్రం (law of conservation of energy), ద్రవ్యరాశి, శక్తి యొక్క పరస్పర మార్పిడి సూత్రం (principle of inter-convertibility of mass and energy) ద్వారా బాగా అర్ధం చేసుకోవచ్చు. ఆత్మను శక్తితో పోలిస్తే కృష్ణ భగవానుని మాటలు బాగా స్పష్టమవుతాయి. శక్తి పరిరక్షణ సూత్రం ప్రకారం శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము కానీ ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చగలం. ఉదాహరణకు ఉష్ణశక్తి స్థానాలు (థర్మల్ పవర్ స్టేషన్లు) ఉష్ణశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. ఒక బల్బు విద్యుత్ శక్తిని కాంతిగా మారుస్తుంది. కాబట్టి ఇక్కడ కేవలం శక్తి మార్పిడి జరుగుతోంది కానీ నాశనము కాదు. బల్బు జీవితం పరిమితకాలం. ఇది కాలిపోతే కొత్త బల్బును పెడతాము కానీ విద్యుత్తు అలాగే ఉంటుంది. ఇది జీర్ణమైన వస్త

23. ఆత్మ అవ్యక్తమైనది

చిత్రం
శ్రీకృష్ణుడు అర్జునుడితో (2.25) “ఇది” (దేహి/ఆత్మ) అవ్యక్తమైనది, అనూహ్యమైనది, వికారరహితమైనదని చెప్పి, ఒకసారి మీరు దీని గురించి తెలుసుకుంటే, భౌతిక శరీరం కోసం దుఃఖించ వలసిన అవసరం లేదని అంటారు. ఇంకా, పుట్టుకకు ముందు అన్ని జీవులు అవ్యక్తంగా ఉంటాయని, పుట్టుకకు చావుకు మధ్య మాత్రమే వ్యక్తమవుతాయని, తిరిగి మరణించాక అవ్యక్త (అదృశ్య) మవుతాయని శ్రీకృష్ణుడు (2.28) బోధిస్తున్నారు. అనేక సంస్కృతులు దీనిని వివరించడానికి సముద్రము, అలల పోలికలు ఇస్తాయి. సముద్రం అవ్యక్తాన్ని సూచిస్తే అల వ్యక్తాన్ని సూచిస్తుంది. సముద్రం నుంచి అలలు అనేక పరిమాణాలు, ఆకారాలు, తీవ్రతలతో కొంత కాలపరిమితి కోసం మాత్రమే వ్యక్తమవుతాయి. చివరికి అలలు అవి పుట్టిన సముద్రంలోనే కలిసిపోతాయి. వ్యక్తమయ్యే అలలను మాత్రమే ఇంద్రియాలు తెలుసుకోగలవు. అలాగే ఒక విత్తనానికి చెట్టుగా ఎదిగే సామర్థ్యం ఉంటుంది. విత్తనంలో చెట్టు అవ్యక్త రూపంలో ఉంటుంది. అది మొలక రావడం మొదలవగానే వ్యక్తమవడం మొదలు పెడుతుంది. చివరికి అది అనేక విత్తనాలను ఉత్పత్తి చేసి మరణిస్తుంది. ఇంద్రియాలు తమ పరిమితమైన సామర్థ్యంతో తెలుసుకోగల వాటిని 'వ్యక్తము' అంటాము. ఆధుని

22. సంతులనమే పరమానందం

చిత్రం
విషయెంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖ దుఃఖములు కలుగుచున్నవని భగవద్గీత ప్రారంభంలోనే శ్రీకృష్ణుడు చెబుతారు (2.14). అవి అనిత్యములు కనుక వాటిని సహింపమని ఆయన అర్జునుడికి చెబుతారు. సమకాలీన సమాజంలో దీనిని 'ఇది కూడా దాటిపోతుంది' అని వ్యక్తీకరిస్తారు. అనుభవాత్మకమైన స్థాయిలో మనం దీనిని అలవర్చుకోగలిగితే ఈ ద్వంద్వాలను అధిగమించి వాటిని సమానంగా చూడడం అలవర్చుకుంటాము. మనకు చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ అనే ఐదు ఇంద్రియానుభూతులు ఉన్నాయి. వాటిని వ్యక్తీకరించే భౌతిక సాధనాలు కళ్ళు, చెవులు, ముక్కు నాలుక, చర్మం. సంబంధిత అవయవాల ద్వారా వచ్చే సమాచారాన్ని క్రమబద్దీకరించడానికి మెదడులో కూడా ఒకో ఇంద్రియానికి ఒకో ఒక భాగం ఉంటుంది. ఇంద్రియ సాధ నాలకి అనేక పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకి కన్ను - ఇది ఒక రకమైన పౌనఃపుణ్యం గల కాంతిని మాత్రమే క్రమబద్ధం చేయగలదు. దీన్నే మనం దృశ్యమాన కాంతి (విజిబుల్ లైట్) అంటాము. రెండవది అదీ సెకనుకి 15 బొమ్మల కంటే గుర్తించలేదు. తెరపై చూసినప్పుడు మనకి ఆనందాన్ని ఇచ్చే వీడియోలు, సినిమాల సృష్టి వెనక ఉన్న సూత్రం ఇదే. మూడవది, దేన్నైనా చూడడానికి కనీసం కొంత కాంతైనా కావాలి. ఇంద

21. సృజనాత్మకతను నాశనము చేయలేము

చిత్రం
అంతరాత్మను అర్థం చేసుకునే తృష్ణతో ఉన్న మానవాళికి రెండు రకాల జ్ఞానులు మార్గదర్శకత్వం చేశారు. రెండు మార్గాల గమ్యం ఒకటిగానే ఉన్నప్పటికీ ఒకరు సానుకూల పక్షం నుంచి, మరొకరు ప్రతికూల పక్షం నుంచి ప్రయాణిస్తారు. ఇక్కడ ప్రయాణం ఆరంభించే స్థలంలోనే తేడా ఉంటుంది. ఏ మార్గంలో వెళ్ళాలి అన్నది మన స్వభావం పై ఆధారపడి ఉంటుంది. సానుకూల దృక్పథంతో సాగే మార్గదర్శనము నాశనము లేనిది, శాశ్వతమైనది, స్థిరమైనది, సర్వత్రా వ్యాపించి ఉన్నది అయిన 'దాన్ని', దానికి 'ఇంకేమి కలపలేని' దానిగా వర్ణిస్తుంది. 'సృజనాత్మకత' దీనికి రూపకం. ప్రతికూల దృక్పధంతో సాగే మార్గదర్శనం నాశనం చేయలేనిది, స్థిరమైనది, శాశ్వతమైనది, సర్వత్రా వ్యాపించబడినది అయిన 'దాన్ని', దాని నుండి 'ఇంకేమి తీయలేని' దానిగ వర్ణిస్తుంది. 'శూన్యం' దీనికి ఒక రూపకం. 'సృజనాత్మకత', 'శూన్యం' అనేవి రెండూ సృష్టి/భౌతిక వ్యక్తీకరణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 'సృజనాత్మకత' సృష్టికి దారితీస్తుందని అంతర్లీనంగా అర్థం చేసుకోవడం సులభం. మరొకవైపు విజ్ఞాన శాస్త్రం ఈ సమస్త సృష్టి 'శూన్యం' నుంచి ప