పోస్ట్‌లు

మార్చి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

56. ఆధ్యాత్మికత యొక్క కారణం, ప్రభావం

చిత్రం
  “ మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖము లన్నియును నశించును. ప్రసన్నచిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ది అన్ని విషయముల నుండి వైదొలగి , పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును ” అని శ్రీకృష్ణుడు బోధపరుస్తున్నారు ( 2.65). మన కోరికలన్నీ తీరిన తర్వాత మనం సంతుష్టి చెంది సుఖాన్ని పొందుతాము ; దుఃఖాన్ని దూరం చేసుకుంటామని మనం భావిస్తుంటాము. కానీ శ్రీకృష్ణుడు మనల్ని మొదట సంతుష్టి చెందమని మిగిలినవి వాటంతటవే అనుసరిస్తాయని చెప్తున్నారు. ఉదాహరణకు , మనకు జ్వరం , నొప్పులు మొదలైన లక్షణాలు ఉంటే మనం ఆరోగ్యంగా లేమని నిర్ధారిస్తాము. ఈ లక్షణాల మూలాలకు చికిత్స చేయకుండా వీటిని అణచివేయడం వల్ల మన ఆరోగ్యం కుదుటపడదు. పోషకాహారం , మంచి నిద్ర , వ్యాయామము మొదలైనవి మనకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అదే విధంగా అసంతృప్తికి కారణమైన భయం , క్రోధం , ద్వేషం అనేవి మనలో సంతృప్తి లేకపోవడాన్ని సూచిస్తాయి. వాటిని కృత్రిమంగా అణచివేయడం మూలంగా మనము సంతృప్తి చెందము. క్రోధము , ద్వేషాన్ని అణిచివేసి సమాజంలో ఆమోదయోగ్యమైన ప్రవర్తనను ప్రదర్శించడానికి అనేక శీఘ్ర పరిష్కారాలు బోధించ బడ్డాయి ; ప్రస్తుత కాలంలో ఆచరణలో కూడా ఉన్నాయి. కానీ ఈ

55. విష, అమృత వలయాలు

చిత్రం
  విష , అమృత వలయాలు ఒక సంఘటన నుంచి మరొకదానికి దారితీసే సంఘటనల శ్రేణి ; ఇవి దుఃఖాన్ని లేదా సుఖాన్ని కలిగిస్తాయి. ఖర్చులు ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే ఋణాలు , అప్పుల ఉచ్చుకు దారి తీస్తే అది ఒక విషవలయం. ఆదాయం కంటే ఖర్చులు తక్కువగా ఉండి సంపద సృష్టి జరిగితే అది ఒక అమృత వలయం. శ్రీకృష్ణుడు ఈ వలయాలను గురించి 2.62 నుండి 2.64 శ్లోకాలలో పేర్కొన్నారు. “ విషయచింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తివలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. అట్టి క్రోధమువలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి ఛిన్నాభిన్నమగును. స్మృతిభ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధినాశమువలన మనుష్యుడు తన స్థితినుండి పతనమగును ” అని శ్రీకృష్ణుడు చెప్పారు ( 2.62-2.63). ఇది పతనానికి సంబంధించిన విష వలయం. “ అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై , ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును ” అని శ్రీకృష్ణుడు అంటారు (2.64). ఇది శాంతి , ఆనందం యొక్క అమృత వలయం తప్ప మరొకటి కాదు. మనమందరం దైనందిన జీవితంలో ఆకర్షణీయమైన లేక అసహ్యమై

54. ఇంద్రియాల స్వయంచాలకత

చిత్రం
  “ ఓ అర్జునా! ఇంద్రియములు ప్రమథన శీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను , ఆసక్తి తొలగి పోనంతవఱకు అవి అతని మనస్సును ఇంద్రియార్ధముల వైపు బలవంతముగా లాగికొనిపోవుచునే యుండును ” అని శ్రీకృష్ణుడు అర్జునుడిని హెచ్చరించారు ( 2.60). ఈ శ్లోకం , బాహ్య ఇంద్రియ విషయాలకు ఇంద్రియాల స్వయంచాలకతను గురించి చెప్తుంది. ధూమపానం యొక్క నష్టాలను గురించి బాగా తెలిసి కూడా , దానిని మానివేయలేక ధూమపానం చేసేవారు. ఇందుకు ఉత్తమ ఉదాహరణ. సిగరెట్ మానుదామనుకున్నా తమకు తెలియకుండానే సిగరెట్ వెలిగించేసామని బాధపడుతూ ఉంటారు. రోడ్లపై ఇతరుల తప్పిదాలకు కొట్లాడేవారు (రోడ్డు రేజ్) , లేదా నేరాల్లో పాల్గొన్న వారెవరైనా అది స్పృహతో కాకుండా క్షణికావేశంలో జరిగిందే కానీ ఉద్దేశ పూర్వకంగా కాదని ప్రమాణ పూర్వకంగా చెబుతారు. కార్యాలయంలో లేదా కుటుంబంలో కఠినమైన పదాలు మాట్లాడే వ్యక్తి విషయంలో కూడా అదే జరుగుతుంది. అవి ఉద్దేశించి అన్నవి కానందున తరువాత పశ్చాత్తాపపడతారు. ఇంద్రియాలు మనల్ని స్వాధీనం చేసుకుంటాయని , కర్మ బంధనంలో మనల్ని బంధిస్తాయని ఈ ఉదాహరణలు సూచిస్తున్నాయి. చిన్నప్పుడు , మెదడులోని కణాలు (న్యూరాన్లు) నడక వంటి స్వయ

53. ఇంద్రియ విషయవాంఛను వదులుకోవడం

చిత్రం
  “ ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించని వ్యక్తి నుండి , ఇంద్రియ వస్తువులు దూరమైపోతాయి కానీ ' రస్ ' ( కాంక్ష/ రాగం) విడనాడదు. పరమాత్మను తెలుసుకున్నప్పుడు మాత్రమే కోరిక అంతమై పోతుంది ” అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు ( 2.59). ఇంద్రియాలకు భౌతిక పరికరం , మెదడులో ఒక నియంత్రకం ఉంటాయి. మనస్సు అనేది అన్ని ఇంద్రియ నియంత్రకాల కలయిక. కోరికలకు స్థానమైన ఈ నియంత్రకాలపై దృష్టి సాధించమని శ్రీకృష్ణుడు మనకు సలహా ఇస్తున్నారు. శ్రీకృష్ణుడు ' రస్ ' ( రసం) అనే పదాన్ని ఉపయోగిస్తారు. పండిన పండ్లను కోసి పిండినప్పుడు తప్ప రసం కనిపించదు ; పాలలో ఉన్న వెన్న పరిస్థితి కూడా అంతే. అలాగే ' రన్ ' అనేది ఇంద్రియ నియంత్రకాలలో ఉండే అంతర్గత కోరిక. అజ్ఞాన స్థాయిలో , ఇంద్రియాలు ఇంద్రియ వస్తువులతో జతచేయబడతాయి ; సుఖదుఃఖాల యొక్క ద్వంద్వాల మధ్య ఊగిస లాడుతూ ఉంటాయి. తదుపరి దశలో కోరికలను తీర్చు కోవడానికి మార్గం లేక ఆ కోరికలను వదిలి వేస్తాము. ఉదాహరణకి , డబ్బు లేకపోవడం లేదా వైద్యుల సలహా వంటి బాహ్య పరిస్థితుల కారణంగా మిఠాయి వంటి ఇంద్రియ వస్తువులను వదిలేస్తాము కానీ మిఠాయిపై కోరిక మిగిలిపోతుంది. నైతికత , దేవుడ

52. ఉపసంహరించుకోవడమే వివేకం

చిత్రం
  “ తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనునట్లుగా , ఇంద్రియములను ఇంద్రియార్థముల (విషయాదుల) నుండి అన్నివిధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. ” అని శ్రీకృష్ణుడు చెప్తున్నారు ( 2.58).       శ్రీకృష్ణుడు ఇంద్రియాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే అవి మన అంతర్గత , బాహ్య ప్రపంచాలకి మధ్య ద్వారముల వంటివి. తాబేలును ఉదాహరణగా తీసుకుంటే అది ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు దాని అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియ వస్తువులతో ఇంద్రియాలు జతకూడటం గమనించినప్పుడు మన ఇంద్రియాలను ఉపసంహరించుకోవాలని ఆయన సలహా ఇస్తున్నారు.       ప్రతి ఇంద్రియానికి రెండు భాగాలు ఉంటాయి. ఒకటి బయటకు కనిపించే కన్ను వంటి బాహ్య ఇంద్రియ పరికరం. రెండవది ఈ కన్నును నియంత్రించే మెదడులోని ఇంద్రియ నియంత్రక భాగం.       ఇంద్రియముల ఇంద్రియార్థముల మధ్య పరస్పర స్పందనలు రెండు స్థాయిలలో జరుగుతాయి. మొదటిది , కాంతి యొక్క కణాలు (ఫోటాన్లు) బాహ్య ఇంద్రియ పరికరమైన కన్నును చేరినప్పుడు కన్ను స్వయంచాలకంగా కాంతికి స్పందిస్తుంది. అలాగే మిగతా ఇంద్రియ పరికరాలు కూడా తమ తమ ఇంద్రియ విషయాలకు స్వయం

51. విరక్తి కూడా ఒక అనుబంధమే

చిత్రం
  మనం ఒక పరిస్థితిని , ఒక వ్యక్తిని లేదా ఒక పని యొక్క ఫలితాన్ని మంచి , చెడుగా విభజిస్తాము. ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యని మూడవ స్థితి కూడా సంభవమే. శ్రీకృష్ణుడు ఈ మూడవ స్థితిని ప్రస్తావిస్తూ , “ దేనియందును మమతాసక్తులు లేనివాడును , అనుకూల పరిస్థితుల యందు హర్షము , ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడును అగు పురుషుడు స్థిత ప్రజ్ఞుడు అనబడును ” అని చెప్తారు ( 2.57). స్థితప్రజ్ఞుడు ( 2.50) తన స్వంత అభిప్రాయాల్ని వదిలివేసి వాస్తవాలను వాస్తవాలుగా తీసుకుంటాడని ఇది సూచిస్తుంది , ఎందుకంటే ఇలా మంచి లేదా చెడు అనే విభజనే సుఖదుఃఖాలనే ద్వంద్వాలకు జన్మస్థలం. .       పరిస్థితులను , వాస్తవాలను తక్షణమే మంచి లేదా చెడు అని పేర్కొనే మన ధోరణికి విరుద్ధంగా ఈ బోధన నడుస్తుంది కాబట్టి కఠినమైనది గా అనిపిస్తుంది. చెడుగా అనిపించే పరిస్థితి లేదా వ్యక్తిని ఎదుర్కొన్నప్పుడు అయిష్టత , విరక్తి , ద్వేషం స్వయంచాలకంగా అనుసరిస్తాయి. కాని స్థితప్రజ్ఞుడు ఏ పరిస్థితి గురించి అభిప్రాయాన్ని ఏర్పరచుకోడు కాబట్టి అతనిలో ద్వేషం యొక్క పుట్టుకకు అవకాశమే లేదు. అదే విధంగా మంచిని చూసినప్పుడు స్థితప్రజ్ఞుడు పొం

50. రాగం, భయం, క్రోధం

చిత్రం
  దుఃఖములకు కృంగిపోనివాడును , సుఖములకు పొంగిపోని వాడును , రాగము , భయము , క్రోధము లేని వాడిని స్థితప్రజ్ఞుడు అందురు ” అని శ్రీకృష్ణుడు చెప్పారు ( 2.56). సుఖం-దుఃఖం , లాభం - నష్టం ; విజయం-అపజయాలను సమానంగా భావించమని శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశానికి ( 2.38) ఇది కొనసాగింపు.       మనమందరం సుఖాన్ని కోరుకుంటాము కానీ దుఃఖం అనివార్యంగా మన జీవితాల్లోకి వస్తుంది. ఎందుకంటే అవి రెండూ ద్వంద్వ (ధ్రువ) జంటలుగా ఉన్నాయి. ఇది ఎర వెనుక కొక్కెం దాగి ఉన్న చేపల ఎర లాంటిది. మరోవైపు కష్టంతో కూడిన పరిశ్రమ ఎల్లప్పుడూ ప్రతిఫలాన్ని తెస్తుంది.       స్థితప్రజ్ఞుడు అంటే ఈ ధ్రువాలను అది గమించి ద్వంద్వాతీతుడైన వాడు. మనం ఒకదానిని ఆశిస్తున్నప్పుడు బహుశా వేరే ఆకారంలో లేక కొంత సమయం గడిచిన తర్వాత దాని విపరీతము అయిన రెండో ధృవం మనని అనుసరించడానికి బాధ్యలవుతామన్న అవగాహన.       మన ప్రణాళికతో మనం సుఖాన్ని పొందినప్పుడు అహంకారం ఉప్పొంగిపోతుంది. అది ఉత్తేజం తప్ప మరేమీ కాదు. అయితే అది దుఃఖంగా మారినప్పుడు అహంకారం గాయపడుతుంది. ఇది ఉద్రేకం , క్రోధం తప్ప మరేమీ కాదు , ఇది నిస్సందేహముగా అహంకారం యొక్క ఆటని సూచిస్తుంది. స్థితప్రజ్ఞుడు