పోస్ట్‌లు

జులై, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

82. మనం విత్తినదే కోసుకుంటాము

చిత్రం
        “ పార్థా! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహింతును. మనుషులందరునూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు ” అని శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు , శక్తివంతమైన అవ్యక్తానికి , వస్తు రూపం దాల్చిన వ్యక్తానికి మధ్య సంబంధం గురించి అంతర్దృష్టిని ఇస్తున్నారు ( 4.11).       మనం ఏ మార్గాన్ని అనుసరించినా , ఈ దారులు ఎంత వైరుధ్యంగా కనిపించినా అవన్నీ అవ్యక్తమైన పరమాత్మను చేరుకునే మార్గాలేనని భగవంతుడు ఇచ్చిన హామీ ఇది. రెండవది , భగవంతుడు మన భావాలు , ఆలోచనలు , చర్యలను ప్రతిబింబించే , ప్రతిధ్వనించే బహుళ పరిమితుల అద్దం ( multi dimensional mirror) లాంటివారు. మూడవది , మనం ఒక విత్తనాన్ని నాటినప్పుడు అది మొలకెత్తి ఒక చెట్టుగా పెరగడానికి సమయం పడుతుంది. ఈ సమయంలోని జాప్యం వలన మనం పరమాత్మ యొక్క ప్రతిధ్వని సూత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతాము.       మనం మన జీవితాలను షరతులు లేని ప్రేమతో నింపుకుంటే శ్రద్ధ , ప్రేమ అనివార్యంగా తిరిగివచ్చి మన జీవితాలను ఆనందమయం చేస్తాయి. మనం కోపాన్ని , భయాన్ని , ద్వేషాన్ని , క్రూరత్వాన్ని లేదా అసూయను నాటితే అవే తిరిగి వ్యాపించి మన జీవ

81. 'నేను' అనేది సమగ్రత

చిత్రం
        భగవద్గీతలో అర్జునుడు , శ్రీకృష్ణుడు ఇద్దరూ ' నేను ', అనే పదాన్ని ఉపయోగించారు కానీ అర్థం , సందర్భం భిన్నంగా ఉంటాయి. అర్జునుడి ' నేను ' అనేది అతని భౌతిక శరీరం , ఆస్తులు , భావాలు , నమ్మకాలను సూచిస్తుంది. అంతే కాకుండా అతని కుటుంబం , స్నేహితులు , బంధువులు కూడా ఇందులో మిళితమై ఉంటారు. మన స్థితి కూడా అర్జునుడి పరిస్థితికి భిన్నంగా లేదు. ముఖ్యంగా మనం కొన్ని వస్తువులకు యజమానులము ; మరికొన్నింటికి కాము అని భావిస్తాము.       శ్రీకృష్ణుడు ' నేను ' అని ఉపయోగించినప్పుడు ఇది సమగ్రతను సూచిస్తుంది. మన ఇంద్రియాల పరిమితి కారణంగా మనం గ్రహించే విభిన్న ద్వంద్వాలు , వైరుధ్యాల వల్ల అన్నింటిలో మనం విభజనలను చూస్తాము కానీ శ్రీకృష్ణుని ' నేను ' ఈ విభజనల యొక్క సమ్మేళనమే. శ్రీకృష్ణుడు అదే పంథాలో కొనసాగుతూ మరొక చోట “ నేను పుట్టుకతో పాటు మరణాన్ని కూడా ” అని చెప్పారు.       శ్రీకృష్ణుడు సముద్రమయితే మనం సముద్రంలో బిందువుల లాంటి వాళ్ళము. కానీ అహంకారం వలన మనకు స్వంత వ్యక్తిత్వము ఉంది అనుకుంటుంటాము. ఎప్పుడైతే ఆ బిందువు తన వ్యక్తిత్వ భ్రమను త్యజించి సముద్రంలో కలిసి

80. మాయ యొక్క అభివ్యక్తి

చిత్రం
        చక్రాన్ని తిప్పడానికి స్థిరమైన లేదా మార్పులేని ఇరుసు అవసరం అయినట్లే , నిరంతరం మారుతూ వ్యక్తమయ్యే భౌతిక ప్రపంచానికి కూడా తన ఉనికిని కొనసాగించడానికి ప్రశాంతమైన , స్థిరమైన , అవ్యక్తమైన కేంద్రము అవసరం. అర్జునుడు మనలాగే వ్యక్తీకరించబడిన మానవ శరీరం యొక్క స్థాయిలో ఉన్నాడు కనుక అతని బంధువుల మరణం గురించి చింతిస్తున్నాడు ; వారు కేవలం వ్యక్తీకరించబడిన అస్తిత్వాలు. ప్రస్తుతం మానవ రూపంలో ఉన్న సర్వోన్నత ప్రభువైన శ్రీకృష్ణుడు అవ్యక్తం కొన్నిసార్లు ఏ విధముగా వ్యక్త రూపాన్ని ధరిస్తుందో వివరిస్తున్నారు.       “ నేను పుట్టనివాడిని , శాశ్వతుడను మరియు జీవులకు ప్రభువును. నా ప్రకృతిని అధీనంలో ఉంచుకుని , యోగమాయ ద్వారా నేను అవతారం ధరిస్తాను ” అని శ్రీకృష్ణుడు చెప్పారు ( 4.6).       అవ్యక్తమైనది , కేవలం ఒక విచారమనే మాయ ద్వారా వ్యక్తమౌతుంది. పరమాత్మ కూడా అలాగే అవతారం ధరిస్తారు. కానీ కోరికలు , కరుణ , స్పృహ స్థాయిలో తేడా ఉంటుంది.       శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటారు , “ ధర్మమునకు హాని కలిగినప్పుడును , అధర్మము పెచ్చుపెరిగి పోవుచున్నప్పుడును నన్ను నేను సృజించుకుందును. అనగా సాకార రూపముతో ఈ

79. కాలాన్ని అధిగమించడం

చిత్రం
        భగవద్గీత అనేది రెండు స్థాయిల యొక్క పొందికైన సమ్మేళనం ; భగవద్గీతను అర్థం చేసుకోవడానికి మనం ఈ స్థాయిల గురించి అవగాహన తెచ్చుకోవాలి. కొన్నిసార్లు శ్రీకృష్ణుడు మానవులు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను వివరిస్తూ , అర్జునుడికి స్నేహితుడిగా లేదా మార్గదర్శిగా వస్తారు. కొన్నిసార్లు ఆయన పరమాత్మగా వచ్చి అస్తిత్వాన్ని ఉపదేశిస్తారు. ఆ స్థితిలో ఆయన ( 4.1) నేను వివస్వతునకు ఈ నాశనం లేని యోగాన్ని ఇచ్చాను అని అంటారు. ఇది రాజ-ఋషులకు వారసత్వంగా అందించబడింది కానీ దాని దృష్టి కాలక్రమేణా కోల్పోయింది అని చెప్పారు ( 4.2).       ' వివస్వతుడు ' అంటే సూర్యభగవానుడని అర్ధం ; ఆయన కాంతికి రూపకం. శ్రీకృష్ణుడు కాంతి కంటే ముందు తాను ఉన్నానని సూచిస్తున్నారు. ఈ విశ్వం కాంతితో ప్రారంభమై ఆ తర్వాత పదార్థం ఏర్పడిందని విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరిస్తుంది.       శ్రీకృష్ణుడు రాజ-ఋషులను ప్రస్తావిస్తున్నప్పుడు వారు వివిధ సమయాలలో జ్ఞానోదయం పొందినవారని అర్ధం చేసుకోవాలి. ఈ జ్ఞానం యొక్క దృష్టి నేడు మాయమైపోయింది ఎందుకంటే కాలక్రమేణా అది అనుభవ స్థాయి నుండి కర్మకాండలు లేదా అనుష్టానాలకు పరిమితం అయ్యింది ;

78. కోరికలకున్న శక్తి

చిత్రం
      కోరికలతో నిండి ఉన్న తులసీదాస్ కు తన నూతన భార్యను కలవాలనే బలమైన కోరిక కలిగింది. అతను ఒక శవాన్ని చెక్కదుంగగా భావించి రాత్రి నదిని దాటాడు ; గోడపైకి ఎక్కడానికి పామును తాడుగా ఉపయోగించి భార్యను కలిశాడు. రక్తమాంసాలతో నిండిన నా శరీరంపై మీకున్న ప్రేమ , ఒకవేళ రామనామం పై ఉన్నట్లయితే జీవితమనే నదిని ఎప్పుడో దాటి ఉండేవారని ఆయన భార్య అన్నది. అతను ఆ క్షణంలోనే పరివర్తన చెంది పరమ పూజ్యమైన ' రామ్ చరిత్ మానస్ ' కు రచయితగా మారాడు.       ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా కోరికలను నాశనం చేయాలనే కృష్ణుడి సలహా ( 3.41) ని బాగా అర్థం చేసుకోవడానికి తులసీదాసు కథ మనకు సహాయం చేస్తుంది.       కోరికకు రెండు కోణాలు ఉంటాయి. మొదటిది మనలో ఉత్పన్నమయ్యే అభిరుచి , సంకల్పం , ధైర్యం అనే శక్తి , రెండవది దాని దిశ. ఆ శక్తి బాహ్యంగా నిర్దేశించబడి ఇంద్రియ సుఖాలు , ఆస్తులను కోరుకున్నప్పుడు వాటిని పొందే ప్రయత్నంలో అది వ్యమవుతుంది. కోరికలను నాశనం చేయమని శ్రీకృష్ణుడు మనకు చెప్పినప్పుడు , ఈ శక్తిని మనం నాశనం చేయకూడదని ; తులసీదాస్ లాగా మనం అంతరాత్మను చేరుకునేందుకు అంతర్గత యాత్ర కొరకు ఉపయోగించాలని అర్థం. కక

77. అద్దం లాంటి సాక్షి

చిత్రం
        “ పొగచే అగ్నియు , ధూళిచే అద్దము , మావిచే గర్భము కప్పివేయబడునట్లు , జ్ఞానము కామముచే ఆవృతమై యుండును ( 3.38). ఓ అర్జునా! కామము అగ్నితో సమానమైనది. అది ఎన్నటికిని చల్లారదు. జ్ఞానులకు అది నిత్యవైరి. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయు చుండును ” అని శ్రీకృష్ణుడు కామము గురించి హెచ్చరించారు ( 3.39).       గుణాలకు మనల్ని సమ్మోహితుల్ని చేసే సామర్థ్యం ఉందని ఇంతకు ముందు శ్రీకృష్ణుడు చెప్పారు. రజోగుణం నుండి పుట్టిన కోరిక కూడా అదే చేస్తుంది. “ ఇంద్రియములు , మనస్సు , బుద్ధి ఈ కామమునకు నివాసస్థానములు. ఇది మనోబుద్దీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి , జీవాత్మను మోహితునిగా చేయును ” అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు ( 3.40).       సాక్షికి అద్దం సరైన ఉదాహరణ. ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా తన ముందుకు తీసుకువచ్చిన పరిస్థితులను , వ్యక్తులను ప్రతిబింబించడమే దీని సామర్ధ్యము , జ్ఞానం. ఇది గతం యొక్క భారాన్ని మొయ్యదు లేదా భవిష్యత్తు నుండి ఎటువంటి అపేక్షలు కలిగి ఉండదు ; ఎల్లప్పుడూ వర్తమానంలో ఉంటుంది. దుమ్ముతో కప్పబడినప్పుడు మాత్రం దాని సామర్థ్యము తగ్గుతుంది.       అద్దం మన నిజమైన